మహిళా సంఘాలకు 183 కొనుగోలు కేంద్రాలు  : కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్

మహిళా సంఘాలకు 183 కొనుగోలు కేంద్రాలు  : కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్

కామారెడ్డిటౌన్, వెలుగు :   జిల్లాలో మహిళా సంఘాలకు 27 వడ్ల కొనుగోలు కేంద్రాలు ఉండగా, ప్రభుత్వ ఆదేశాలతో మరో  156 సెంటర్లను అప్పగిస్తున్నామని కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్ తెలిపారు. శనివారం కలెక్టరేట్​లో వడ్ల కొనుగోలుపై మహిళా సంఘాల గ్రామ కమిటీ ప్రెసిడెంట్లు,  సబ్​ కమిటీ, సిబ్బందికి ట్రైనింగ్ పోగ్రాంలో కలెక్టర్​ మాట్లాడారు. సెంటర్లకు కావాల్సిన సామగ్రిని సమకూర్చుకుని, రైతులకు ఇబ్బందులు కలగకుండా వడ్లను కొనాలన్నారు.  మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల బాధ్యతను అప్పగించిందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్​ వి. విక్టర్, డీఆర్డీవో సురేందర్,  సివిల్​ సప్లయ్ డీఎం రాజేందర్,  డీసీవో రాంమోహన్, మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి రమ్య తదితరులు పాల్గొన్నారు.

అధికారులు అలర్టుగా ఉండాలి.. 

ఎండల తీవ్రత దృష్ట్యా అధికారులు అలర్టుగా ఉండాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో జరిగిన టాస్క్​పోర్స్​ కమిటీ మీటింగ్​లో కలెక్టర్​ మాట్లాడారు. ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా పల్లె, పట్టణాల్లో ఓఆర్ఎస్​ ఫ్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. తాగునీటికి ఇబ్బంది కలుగకుండా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, అగ్నిప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. డీఎంహెచ్​వో చంద్రశేఖర్, డీసీహెచ్​వో విజయలక్ష్మి,   సీపీవో రాజారాం తదితరులు పాల్గొన్నారు.